Monday, October 2, 2023

PRC నియామకం, 5 శాతం మధ్యంతర భృతి (ఐ.ఆర్)

PRC  నియామకం


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.


 కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

 

5 శాతం మధ్యంతర భృతి (ఐ.ఆర్) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

EXAMS- SYLLABUS- RESULTS



Top